Posted on 2025-06-15 17:14:54
కేక్ కట్, వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమంతో పాటు రక్తదానంతో సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక మరియు విద్యుత్ శాఖల మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు బాల శౌరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
టిపిసిసి జనరల్ సెక్రెటరీ మోత్కూరి ధర్మారావు మరియు మాజీ కౌన్సిలర్లు రజాక్ మరియు కాసుల వెంకట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధుల సమక్షంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
NSUI జిల్లా అధ్యక్షుడు అడ్మినా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉర్దూ ఘర్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, పలువురు పార్టీ కార్యకర్తలు, యువకులు రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి స్థానిక ప్రజలు కూడా విశేషంగా స్పందించారు
ఈ సందర్భంగా బాల శౌరి మాట్లాడుతూ, "ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సేవా కార్యక్రమాలతో ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలన్నదే మా లక్ష్యం" అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగం సభ్యులు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరిలో ప్రశంసను అందుకుంది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం కన్వీనర్ జేబీ శౌరి, టిపిసిసి జనరల్ సెక్రెటరీ మోత్కూరి ధర్మారావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, టౌన్ కన్వీనర్ మొహ్మద్ గౌస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రాజశేఖర్,ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నర్సింహారావు,కొత్తగూడెం టౌన్ యూత్ ఉపాధ్యక్షుడు ఎం.డి. ఉస్మాన్, రంజిత్ నాయుడు, షేక్. నాయిమ్, ఎస్ కె. కరీం, కొమురయ్య,దావూద్, మాజీ కౌన్సిలర్లు తంగేళ్ల లక్ష్మణ్, పల్లపు లక్ష్మణ్, ఎండి రజాక్, కాసుల వెంకట్, నిసర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాందాస్,ఆదరి కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు..
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >