Posted on 2025-06-21 15:38:00
డైలీ భారత్, జగద్గిరిగుట్ట: హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కింది పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జషిత్ చౌహాన్ (10) శుక్రవారం సాయంత్రం తన ఇంటికి సమీపంలో సైకిల్ తొక్కుతున్నాడు. ఆ క్రమంలో అనుకోకుండా కింద పడ్డాడు. అదే సమయానికి అటుగా ఓ స్కూల్ బస్సు వచ్చింది. అది మలుపు తిరిగే క్రమంలో ఆ బాలుడు బస్సు ముందు టైరు కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా, అవి ప్రస్తుతం వైరల్గా మారాయి.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >