Posted on 2025-06-21 19:08:00
డైలీ భారత్, జగద్గిరిగుట్ట: హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కింది పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జషిత్ చౌహాన్ (10) శుక్రవారం సాయంత్రం తన ఇంటికి సమీపంలో సైకిల్ తొక్కుతున్నాడు. ఆ క్రమంలో అనుకోకుండా కింద పడ్డాడు. అదే సమయానికి అటుగా ఓ స్కూల్ బస్సు వచ్చింది. అది మలుపు తిరిగే క్రమంలో ఆ బాలుడు బస్సు ముందు టైరు కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా, అవి ప్రస్తుతం వైరల్గా మారాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >