Posted on 2025-06-27 02:56:47
డైలీ భారత్, బెంగళూరు: వంట నచ్చలేదని భార్యను భర్త నరికి చంపాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం రామనగర జిల్లా మాగడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మత్తికెరెలో రంగయ్య(68), తిమ్మమ్మ(65) అనే దంపతులు నివసిస్తున్నారు. బుధవారం రాత్రి భార్య భర్తల మధ్య కూర బాగోలేదని గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో రంగయ్య కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు బయలుదేరాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు భర్తను రామనగర ప్రాంతంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
#banglore #karnataka #wife #crime #kill
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >