Posted on 2025-06-28 07:03:48
డైలీ భారత్, హనుమకొండ: జిల్లాలోని కాజీపేటలో దారుణ హత్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఫైనాన్షియల్ వివాదమే ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. రైల్వే క్వాటర్లో నివసిస్తున్న నవీన్ కుమార్ ( 38)ను అదే ప్రాంతానికి చెందిన గడ్డం ప్రవీణ్ కుమార్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ. 40,000 నగదు అడిగిన విషయం పై మాటామాటా పెరిగింది. ఉద్రిక్తత ముదిరి కత్తితో దాడికి దిగిన ప్రవీణ్, నవీన్ పై నేరుగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఫైనాన్షియల్ నడుపుతున్న నవీన్ కుమార్ కొద్ది రోజుల కిందట ప్రవీణ్ కు 40,000 ఇచ్చాడని ఆ డబ్బులు అడిగినందుకే ప్రవీణ్ ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పై నవీన్ కుమార్ భార్య మాధవి కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >