Posted on 2025-07-07 17:11:49
త్వరలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తమ హక్కుల సాధనకై సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకొస్తాం
వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: రాష్ట్రంలో రోజురోజుకీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు కావాల్సిన కనీస వసతులు కల్పించడంలో విఫలం చెందుతున్నారని వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సూర్య వంశీ అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు పింఛన్ విషయంలో 1000 రూపాయలు అదనంగా మంజూరు చేస్తామని ప్రకటించి ఇప్పుడేమో మోసం చేశారని విమర్శించారు. సోమవారం వికలాంగుల నవిపేట మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ విషయంలో న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పడమే కాకుండా రాష్ట్రంలో వికలాంగుల కొరకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించకపోవడం అన్యాయమన్నారు. అలాగే పెన్షన్ కూడా గత సర్కార్ కంటే వెయ్యి రూపాయలు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే త్వరలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >