Posted on 2025-07-07 15:23:12
వచ్చింది డెలివరీ బాయ్ కాదు.. టెకీ స్నేహితుడే
ఆమె అనుమతితోనే ఇంటికి వచ్చిన స్నేహితుడు
స్ప్రే చల్లి మత్తులోకి నెట్టారన్న ఆరోపణలు కట్టుకథగా వెల్లడి
సెల్ఫీ, బెదిరింపు మెసేజ్లు.. అంతా యువతి సృష్టించిన నాటకమే
యువతిపై చర్యలు తప్పవన్న పోలీసులు
డైలీ భారత్, పూణే: పుణె నగరంలో తీవ్ర కలకలం రేపిన ఐటీ ఉద్యోగిని అత్యాచార కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యువతి చేసిన రేప్ ఫిర్యాదు పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేలా ఉందని పోలీసులు తేల్చారు. కేవలం 24 గంటల్లోనే ఈ కేసులోని గుట్టును రట్టు చేసి, అసలు నిజాలను బయటపెట్టారు.
వివరాల్లోకి వెళితే.. కొంధ్వా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఐటీ ఉద్యోగిని తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డెలివరీ ఏజెంట్ రూపంలో వచ్చిన ఓ వ్యక్తి, తనపై రసాయన స్ప్రే చల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వెళ్లే ముందు తన ఫోన్తో సెల్ఫీ తీసుకుని, ఈ విషయం బయటపెడితే ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరింపు సందేశం టైప్ చేశాడని కూడా తెలిపింది.
ఈ తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులకు.. ఆమె చెప్పిన కథనానికి, వాస్తవానికి పొంతన లేదని తేలింది. నిందితుడిగా చెప్పిన వ్యక్తి డెలివరీ ఏజెంట్ కాదని, ఆమెకు ముందే పరిచయమున్న స్నేహితుడని గుర్తించారు. ఆమె అనుమతితోనే అతను ఫ్లాట్కు వచ్చాడని, బలవంతంగా ఇంట్లోకి చొరబడలేదని నిర్ధారించారు.
ఈ విషయంపై పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ, "యువతి చేసిన ఫిర్యాదు పూర్తిగా కల్పితం. ఎలాంటి రసాయన స్ప్రే వాడలేదు, అత్యాచారం జరగలేదు. ఆమె స్నేహితుడు ఆమె సమ్మతంతోనే ఫ్లాట్కు వచ్చాడు. బెదిరింపు సందేశాన్ని యువతే స్వయంగా టైప్ చేసుకుంది" అని వెల్లడించారు. తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా చేసినట్లు యువతి విచారణలో చెప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పుణె నగర భద్రతపై తప్పుడు ప్రచారాలు జరిగాయని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన యువతిపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >