| Daily భారత్
Logo




అదనపు కలెక్టర్ సాక్షిగా గిరిజన బాలికల వసతి గృహంలో పురుగుల భోజనం

News

Posted on 2025-07-07 21:36:14

Share: Share


అదనపు కలెక్టర్ సాక్షిగా గిరిజన బాలికల వసతి గృహంలో పురుగుల భోజనం

అవాక్కైనా అధికారులు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏకంగా జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలనకు అదనపు కలెక్టర్ విక్టర్ ను అదేశించారు. కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదిని, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలసి మద్యహ్న భోజనం చేశారు. ఆయన తినే భోజనంలోనే పురుగులు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థులకు హస్టల్ లలో సన్నబియ్యం, నాన్ వెజ్ మెనూ అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. బియ్యంను ప్రభుత్వం సరఫరా చేస్తుండగా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ ఇస్తుండగా పురుగులు ఎలా వచ్చాయనే సంశయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినీలు పురుగులు వస్తున్నాయని రోడ్డెక్కగా, అదనపు కలెక్టర్ తో పాటు అధికారులు మధ్యాహ్నం భోజనం చేస్తే అందులో పురుగులు రావడంతో అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అనే విషయం తేట తెల్లమైంది. పురుగుల అన్నంను విద్యార్థులకు వండి వార్పుతున్న గిరిజన బాలికల గురుకుల శాల అధికారులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు అనుకుంటారో వేచి చూడాలి.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >