Posted on 2025-07-08 12:57:22
డైలీ భారత్, లింగాలఘనపురం: మద్యానికి బానిసగా మారి భార్యలను వేధిస్తుండడంతో భర్తను గొడ్డలి ఇద్దరు భార్యలు నరికి చంపారు. ఈ సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఏనబావి గ్రామ శివారులో పిట్లోనిగూడెంలో కాల్వ కనకయ్య(30) ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నాడు. కనకయ్య మద్యానికి బానిసగా మారాడు. మే నెలలో మద్యం మత్తులో అక్కను కనకయ్య హత్య చేసి పారిపోయాడు.
అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ భార్యలతో పాటు గ్రామస్థులను బెదిరించేవాడు. అతడి ఆగడాలకు ఎక్కువ కావడంతో భార్యలు విసిగిపోయారు. సోమవారం రాత్రి ఇంటికి చేరుకొని భార్యలను చంపేస్తానని గొడ్డలి పట్టుకొని తిరిగాడు. దీంతో భార్యలు ఎదురుతిరిగి గొడ్డలి తీసుకొని అతడిని నరికేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >