| Daily భారత్
Logo




భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు

News

Posted on 2025-07-08 12:57:22

Share: Share


భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు

డైలీ భారత్, లింగాలఘనపురం: మద్యానికి బానిసగా మారి భార్యలను వేధిస్తుండడంతో భర్తను గొడ్డలి ఇద్దరు భార్యలు నరికి చంపారు. ఈ సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఏనబావి గ్రామ శివారులో పిట్లోనిగూడెంలో కాల్వ కనకయ్య(30) ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నాడు. కనకయ్య మద్యానికి బానిసగా మారాడు. మే నెలలో మద్యం మత్తులో అక్కను కనకయ్య హత్య చేసి పారిపోయాడు.

అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ భార్యలతో పాటు గ్రామస్థులను బెదిరించేవాడు. అతడి ఆగడాలకు ఎక్కువ కావడంతో భార్యలు విసిగిపోయారు. సోమవారం రాత్రి ఇంటికి చేరుకొని భార్యలను చంపేస్తానని గొడ్డలి పట్టుకొని తిరిగాడు. దీంతో భార్యలు ఎదురుతిరిగి గొడ్డలి తీసుకొని అతడిని నరికేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >