Posted on 2025-07-08 09:59:03
డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టింది. రైలు వెళ్లే సమయానికి గేటు వేయకపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 10 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తోంది.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటినా రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైల్వే గేట్ కీపర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >