| Daily భారత్
Logo




కన్న కూతురిని హతమార్చిన తల్లికి జీవిత ఖైదు

News

Posted on 2025-07-08 16:01:20

Share: Share


కన్న కూతురిని హతమార్చిన తల్లికి జీవిత ఖైదు

మామతో వివాహేతర సంబంధం బయటపెడుతందనే  అనుమానంతో కుమార్తెను హత్య చేసిన తల్లి

 - దర్యాప్తులో పట్టుబడ్డ తల్లి ఘాతుకం

 - జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి న్యాయస్థానం తీర్పు

డైలీ భారత్, ఖమ్మం:కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లే కుమార్తెను కడతేర్చింది. మామతో వివాహేతర సంబంధాన్ని బయటకు చెప్పేస్తుందనే నెపంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. కన్న కుమార్తెను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ కేసులో తల్లితో పాటు ఆమె మామకూ జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానంలో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌ సోమవారం తీర్పు చెప్పారు. 2022లో జరిగిని ఈ ఘటన ఆ సమయంలో ఎన్నో మలుపులతో ఈ కేసు సంచలనం సృష్టించింది.

పోలీసులు, ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు(65) కు హరికృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి సునీత(32) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. సునీత, తన మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగించేది. 2022, ఫిబ్రవరి 8న భర్త హరికృష్ణ ఇంట్లో లేని సమయంలో మామ, సునీత ఏకాంతంగా ఉండటాన్ని ఆమె కుమార్తె చూసింది.

విషయం బయట పడుతుందనే భయంతో సునీత తన మామతో కలిసి కన్న కుమార్తెను హత్య కడతేర్చింది. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి అతిదారుణంగా చంపారు. హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. బాలికకు ఫిట్స్‌ వచ్చి కింద పడిపోయిందని నమ్మబలికి స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ఖమ్మం తరలించాలని వైద్యులు సూచించటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలిక చనిపోయిందని నిర్ధారించారు. బాలిక మృతదేహానికి శవ పరీక్ష చేయొద్దని తల్లి, తాత ఒత్తిడి తెచ్చారు.

అయితే పాప మెడపై రాపిడి ఉన్న గుర్తులను చూసిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి ఎస్సై కవిత ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ ప్రకారమే దర్యాప్తు చేపట్టారు. నిందితులు కేసు నుంచి బయట పడేందుకు గ్రామంలోని మరో యువకునిపై నేరం నెట్టే ప్రయత్నాలు చేశారు.

కాగా సదరు యువకుడికి తనతో వివాహేతర సంబంధం ఉందని అతనే తన కుమార్తెను చంపాడని మామ అండతో సునీత పోలీసులకు చెప్పింది. అయితే ఆ యువకుణ్ని పోలీసులు విచారించగా సునీతతో తనుకు వివాహేతర సంబంధం ఉన్నమాట నిజమేనని కానీ హత్యతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపాడు.

చివరగా సునీతను విచారించగా హత్య విషయం బయటకు వచ్చింది. ఈ కేసు పూర్వాపరాలు, వైద్య నివేదికలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత నిందితులపై మోపిన నేరం రుజువు కావడంతో వారికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ అబ్దుల్‌పాషా వాదించారు. అదనపు ప్రాసిక్యూటర్‌తో పాటు విచారణ అధికారులు కోర్టు లైజనింగ్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌, కోర్టు కానిస్టేబుల్‌ బి.అరవింద్, ఎస్సై కవిత, సీఐ మురళిలను పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ అభినందించారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >