Posted on 2025-07-26 06:33:31
షాద్ నగర్ చౌరస్తాపై ఘోర రోడ్డు ప్రమాదం
ట్యాంకర్ ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి
నన్ను కాపాడండి అంటూ బిటెక్ విద్యార్థిని మైత్రి వేడుకోలు
డైలీ భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయమే ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కూతుళ్లు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్ నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ నిర్లక్ష్యంగా బైక్ పై వస్తున్న వారిని ఢీకొట్టడంతో పట్టణానికి చెందిన మచ్చేందర్ అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం అక్కడ కన్నీరు పెట్టించింది. మైత్రికి వస్తున్న తన స్నేహితురాల ఫోన్లో ఇతరుల ఫోన్లకు తయ్యబ్ సమాచారం తెలియజేశారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విషయమై పట్టణ సీఐ విజయ్ కుమార్ ను వివరణ కోరగా తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోయారని సిఐ తెలిపారు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐ తెలిపారు. శవాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు..
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >