Posted on 2025-07-31 17:44:34
ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు అయింది సంతోషం.. ఇందులో రాజకీయ పార్టీల జోక్యాలు అవసరమా..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తుందని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ ప్రకటించినప్పటి నుండి జిల్లాలో దేవాలయాల లాంటి విద్యాసంస్థలకు కూడా రాజకీయ రంగులు పులుముతున్నారు. మొదటగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అసెంబ్లీలో జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ అవసరం అని చెప్పడంతోనే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడబోతుందని బిజెపి శ్రేణులు ఇటు సంబరాలు జరుపుకుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘం నేతలు కాంగ్రెస్ పార్టీ వల్లే జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు కాబోతుందని సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే ఇది ఇలా ఉంచితే జిల్లాలు తెలంగాణ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం జిల్లాలోని ప్రతి ఇంజనీరింగ్ చదివే విద్యార్థికి సంతోషకరమైన విషయమే కానీ ఇందులో రాజకీయ నాయకుల అత్యుత్సాహం ఏంటో అర్థం కావడం లేదు. నిజానికి జిల్లాలు ఇంజనీరింగ్ ప్రభుత్వ కళాశాల ఏర్పాటు కాబోతున్నందున ఇంజనీరింగ్ చదవాలనుకునే పేద విద్యార్థులు సంతోషం వ్యక్తం చేయాల్సింది పోయి ఆ రెండు రాజకీయ పార్టీ నేతలు తమ స్వలాభం కోసం ఇలా విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం సరైనదే అని పలువురు చర్చించుకుంటున్నారు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >