Posted on 2025-08-03 10:41:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్మూర్ నియోజకవర్గంలో రెండవరోజు కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ఉత్సాహంగా ప్రారంభమైంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రెండు సంవత్సరాలు క్రితం రాహుల్ గాంధీ తమకు దిశా నిర్దేశం చేశారని అన్నారు.ఈ క్రమంలో రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారు. సోనియా, రాహుల్ స్పూర్తితో జనహిత పాదయాత్ర ప్రారంభించం జరిగిందన్నారు.
రాహుల్ ఎక్కడైకి వెళ్లినా తెలంగాణ మోడల్ ని ప్రస్తావిస్తారు. తెలంగాన మోడల్ అంటే జాతిని ఒకటి చేయటం అని అన్నారు. కులగణన విషయంలో తమ పార్టీ దేశంలోనే రోల్ మోడల్ అని అన్నారు.42 శాతం బిసి రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ఆందోళన చేయనున్నాం అని అన్నారు. బీహార్ లో ఓట్ల తొలగింపు అక్రమం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి భయంతో 65 లక్షల ఓట్లు తొలగించారన్నారు.
దేశంలో ప్రస్తుతం రెండు మోడల్ లు నడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ది కలిపే దారి, బిజేపీది విడదీసి దారి అని ఎద్దేవా చేశారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయటం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా బలంగా ఉండని ఆయన పునరుద్గాటించారు. బీజేపీ,బిఅరెస్ లు బిసి చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన ఆందోళన ద్వారా మా చిత్తశుద్ధి మరో సారి రుజువు అవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >