Posted on 2025-08-04 08:56:17
తనకు న్యాయం కావాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వృద్ధ మహిళ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మాక్లూరు మండలం గాలిబ్ నగర్ కు చెందిన ప్రభావతి అనే మహిళకు చెందిన భర్త పది సంవత్సరాల క్రితం మృతి చెందారు. అప్పటినుండి ఇద్దరు కుమారులు తనను అక్రమంగా అన్యాయంగా ఇంటి నుండి గెంటి వేయడమే కాకుండా, తన ఇంటి స్థలం వద్ద ఉన్న ఎకరం నర భూమి ఇంటితోపాటు, ఐదున్నర ఎకరాల భూమిని తనకు తెలియకుండానే పట్టా తమపై మార్చుకొని తమను ఇబ్బందులు పెడుతున్నారని ప్రభావతి కుమార్తె శ్రీలత అతని మనుమడు రవి సహాయంతో సోమవారం ప్రజావాణిలో తమ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేయడానికి వచ్చినట్లు బాధితురాలి కుమార్తె పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు పెళ్లయిన తర్వాత కట్నం కింద తమ తల్లిదండ్రులు 4 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని వాటిని కూడా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అది కూడా తమదేనని తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లికి పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని తమ సోదరులు కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, తో పాటు ఇతర ఉన్నతాధికారులు తమ విషయంలో కల్పించుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >