Posted on 2025-08-05 06:55:24
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా కొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (15)తో పాటు పలువురు విద్యార్థులు ఎల్లారెడ్డిపేటలోని ఆటోలో ఓ ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. గాయత్రి కాలేజ్ వద్ద కుక్కలు అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలు కాగా హర్షవర్ధన్ అనే విద్యార్థి కాలు విరిగింది.
వెంటనే స్థానికులు పిల్లలను ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గ్రామాల్లో, వీధులలో కుక్కలు, కోతుల, బెడద, పందులు ఎక్కువ కావడంతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వీటి నుంచి కాపాడవలసిందిగా ప్రజలు వేడుకుంటున్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >