| Daily భారత్
Logo




బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

News

Posted on 2025-10-08 13:52:10

Share: Share


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

డైలీ భారత్, న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు బుధవారం ఢిల్లీ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో షారూఖ్‌కు సంబంధించిన రెడ్ చిల్లీస్ సంస్థకు హైకోర్టు సమన్లు జారీ చేసింది. రెడ్ చిల్లీస్ సంస్థతో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్, మరికొందరికి ఈ సమన్లు జారీ అయ్యాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇతర ప్రతివాదులు ఏడు రోజుల్లోగా తమ సమాధానాలను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అలానే పిటిషన్ కాపీలను తమకు అందించాలని వాంఖడేను కూడా ఆదేశించింది. అలానే ఈ కేసు అక్టోబర్ 30నకు వాయిదా వేసింది

రెడ్ చిల్లీస్, నెట్ ఫ్లిక్స్ లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్, IRS అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టులో పరువు నష్ట దావా వేశారు. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ "ది బా డ్స్ ఆఫ్ బాలీవుడ్" తన ప్రతిష్టను దిగజార్చిందని వాంఖడే పిటిషన్‌లో పేర్కొన్నారు. వాంఖడే తన పిటిషన్‌లో నటుడు షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ ఓనర్లుగా ఉన్న రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, ఇతరుల పేర్లను పేర్కొన్నారు. వారి నుంచి రూ. 2 కోట్ల నష్టపరిహారాన్ని ఆయన కోరారు. ఆ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని వాంఖేడ్ తన పిటిషన్‌లో కోరారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >