| Daily భారత్
Logo




అధికార పార్టీలో జడ్పీ పీఠం దక్కించుకునేది ఎవరు..?

News

Posted on 2025-10-08 16:38:09

Share: Share


అధికార పార్టీలో జడ్పీ పీఠం దక్కించుకునేది ఎవరు..?

తెరమీదికి రాబోతున్న ఈరవత్రి అనిల్ సతీమణి సుహాసిని..

మరి సీనియర్ మహిళా బీసీ నేత ఆకుల లలిత పరిస్థితి ఏంటి..?

జిల్లాలో హాట్ టాపిక్ గా  మారిన జడ్పీ చైర్మన్ పీఠం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రమైంది. అయితే, పదవి ఆశించి ఇటీవల పార్టీలోకి వచ్చిన వారిని కాదని, కష్టకాలంలో జెండా మోసిన వారికే అధిష్టానం పట్టం కట్టాలని నిర్ణయిం చుకున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ జరు గుతుంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి, సదువుల కోసం వేరే పార్టీలో చేది. ఇప్ప మళ్లీ కాంగ్రెస్ అధికారంలో కి రాగానే తిరిగొచ్చిన వారికి జడ్బీ చైర్మన్ సీటు దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలుస్పష్టం చేస్తున్నాయి. పార్టీలోకి చేరేముందే, పదవులు ఆశించకుండా వస్తేనే రండి అని కాంగ్రెస్ పెద్దలు గతంలోనే తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ చర్చకు ప్రధాన కారణం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గతంలో కాం గ్రెస్లో ఉన్నప్పుడు ఆర్మూర్ టికెట్ ఇవ్వగా, ఆమె ఎన్నికల సమయంలో పార్టీకి ద్రోహం చేసి, అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి సహకరిస్తూ సరెండర్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలో రాగానే ఆమె ఆ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగి యగానే, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో, ఆమె ఆ పదవికి రాజీనామా చేసి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కష్టకాలంలో పార్టీని వీడిన వారికి జడ్పీ  చైర్మన్ పదవి దక్కే అవకాశం లేదనే చర్చ మొదలైంది. అయితే, జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రస్తుత మినరల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఈరవత్రి అనిల్ సతీమణి  సుహాసిని వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాచనతో అనిల్ తన స్థానాన్ని బాల్కొండ అభ్యర్థి సునీల్ రెడ్డికి త్యాగం చేశారు. ఈరవత్రి అనిల్ పార్టీలో సీనియర్ నేతగా ఉండటం, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడటం, నేతలందరి మద్దతు. ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండటం వంటి అంశాలు మహాసినికి కలిసి వస్తున్నాయట. సుహాసిని మెండోర నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ, అనిల్ భార్య సుహాసినికే జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని జిల్లాలో చర్చ జోరందుకుంది.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >