Posted on 2025-10-08 17:44:14
యదేచ్ఛగా చెట్లను నరుకుతున్న పట్టించుకోని అటవీశాఖ అధికారులు
తాజాగా 12 మంది పై నామమాత్రపు కేసులు.
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీప దూరంలో గల లింగి తండా అడవులపై స్థానిక తండావాసులు పంజా విసురుతున్నారు. గత కొన్ని రోజులుగా యదేచ్చగా ఫారెస్ట్ కు సంబంధించిన ప్రాంతాలలో చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. మొత్తం 70 ఎకరాలలో గత వారం రోజులుగా చెట్లను నరికేసి తమ అక్రమ వ్యాపారాన్ని సాఫీగా సాగిస్తున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు రావడంతో హడావిడిగా 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ సిసి ఫుటేజ్ ఆధారంగా గుర్తించి వారిపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. మిగిలిన 10 మందిపై అటవీ శాఖలో కేసు నమోదు అయింది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే అటవీ సంపద దోపిడికి గురవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో స్మగ్లర్ల అక్రమ చెట్ల నరికివేత మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. అటవీ శాఖ అధికారుల అండదండలతోనే అటవీ సంపద దోపిడికి గురవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు కొలువుదీరిన జిల్లా కేంద్రానికి సమీప దూరంలోనే అడవులు అన్యక్రాంతమవుతున్న పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ప్రభుత్వాలు అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆలోచనకు గండి పడుతుంది. హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతుండగా, అలాంటి చెట్లనే నరికి వేసిన ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుంది. లింగి తండా అటవీ ప్రాంతంలో స్థానిక తండావాసులు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో అటవీ శాఖ అధికారులు తూతూ మంత్రంగా 12 మంది పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. వారిలో ఇద్దరిని గుర్తించి వారిపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. మరో పదిమంది పై అటవీ శాఖలో కేసు నమోదు చేసిన ఆ పదిమందిని ఇంతవరకు గుర్తించకపోవడం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. గత కొన్ని రోజులుగా అటవీ శాఖకు సంబంధించిన 70 ఎకరాలలో చెట్లను నరుకుతున్న స్పందించకపోవడం స్థానిక తండావాసులుతో కొందరి అటవీశాఖ అధికారులకు పెద్ద ఎత్తున లావాదేవీలు ఉన్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అంతరించిపోతున్న అటవీ సంపదను పరిరక్షించి, స్థానికుల ఆట కట్టించాలని పలువురు కోరుతున్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >