Posted on 2025-10-13 16:39:31
డైలీ భారత్, నిజామాబాద్:మగవారిని ఆకర్షించేలా తమ అందాలను చూపిస్తూ వారిని వల్లో వేసుకోవడానికి ప్రేరేపిస్తూ న్యూసెన్సు క్రియేట్ చేసిన ఆరుగురు మహిళకు జైలు శిక్ష ఖరారైందని నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ లో వివరాలు వెల్లడించారు. ఈనెల 11 న రాత్రి 8 గంటలకు నగరంలోని బస్టాండు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కామారెడ్డి, భైంసా ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలు మగవారిని ఆకర్షించేందుకు తమ అవయవాలను చూపిస్తూ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్సు క్రియేట్ చేస్తుండటంతో వారి పై 68 సిటీ పోలీస్ యాక్టు సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ రఘుపతి వివరించారు.
సోమవారం ఆరుగురు మహిళలను స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచారు. నిందితుల్లో ఒకరికి ఒకరోజు, మిగతా ఐదుగురు నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధించడమైందని ఎస్హెచ్ఓ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వీరిని జైలుకు తరలించినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే వారి పై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని రఘుపతి హెచ్చరించారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >