| Daily భారత్
Logo




బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదు

News

Posted on 2025-10-28 11:40:09

Share: Share


బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదు

కవిత – సీఎం రేవంత్ ప్రభుత్వం బిజినెస్ పార్ట్నర్లు

నిజామాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనూ బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. కవిత రాజీనామా ఆమోదం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కవిత రేవంత్ బిజినెస్ పార్ట్నర్ కాబట్టే రాజీనామా ఆమోదం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఆరు మున్సిపాలిటీలకు రూ.169.3 కోట్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఆ నిధులు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవెనని గుర్తు చేశారు. 80% రాష్ట్రం కేవలం 20% నిధులు మాత్రమే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తామే నిధులు తెచ్చామంటూ ప్రచారం చేయడం విడ్డూరం గా ఉందన్నారు. ఆర్వోబీ నిధుల కేటాయింపుపై దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు త్వరగా ఉన్నాయి మాధవ నగర్ ఆర్ఓబి వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో బీజేపీ పట్టు బలంగా ఉందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతుగా కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్  సూర్యనారాయణ, జాతీయ పసుపు  బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >