| Daily భారత్
Logo




వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితిని పరిశీలించిన పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్

News

Posted on 2025-10-30 08:55:57

Share: Share


వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితిని పరిశీలించిన పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఇటీవలి వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం చిన్న బోనాల వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ...

“రైతు పంట తడిసి నష్టపోతున్నా, ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. వెంటనే నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం ప్రకటించి, పాడైపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలి.” శ్రీకాంత్ అన్నారు.

అలాగే ఆయన తీవ్రంగా విమర్శిస్తూ

 “రైతుల కన్నీళ్లు తుడవడంలో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు కష్టాలపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఫొటోలు, ప్రకటనలతో కాకుండా రైతు పంటను కాపాడటమే నిజమైన పాలన.” అని హెచ్చరించారు.

భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుంది. రైతు న్యాయం కోసం, పంట రక్షణ కోసం అవసరమైతే వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తాం. అని శ్రీకాంత్ తెలిపారు.

త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వాహనాలు హమాళీ గోనె సంచుల  వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో బీజేపీ  పట్టణ ఉపాధ్యక్షులు కంబోజు శ్రీధర్, నరసయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షులు సుంకరి బాలకిషన్, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, దూడం సురేష్, కార్యదర్శి శివరాం వినయ్ దేవరాజు, ఇంజపురం మురళి, గాలి శ్రీనివాస్ వడ్నాల శేఖర్ బాబు రామారావు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >