Posted on 2025-10-31 07:26:45
మండలాల బాధ్యులకు అంబులెన్స్ లను అప్పజెప్పిన ఎమ్మెల్యే
డైలీ భారత్, షాద్ నగర్ :షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు కేశంపేట నందిగామ ఉమ్మడి మండలాలకు ఒక్కో అంబులెన్స్ చొప్పున లిమ్స్ శంషాబాద్ ఆసుపత్రి వారి సౌజన్యంతో నేటినుండి సేవలు అందుబాటులోకి వచ్చాయని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా మండలాల అంబులెన్స్ బాధ్యులకు వాటిని అప్పచెప్పారు. ఇటీవల విజయదశమి పండుగ రోజున అంబులెన్స్లను నూతనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ దానికి సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణను అందజేసి నేడు పూర్తిస్థాయిలో మండలాలకు సేవల కోసం వారికి స్వాధీన పరిచినట్లు ఎమ్మెల్యే చెప్పారు. శంషాబాద్ లిమ్స్ ఆస్పత్రి యజమాని రామరాజు సహకారంతో ఈ అంబులెన్స్ సేవలను పేద ప్రజలకు ఉచితంగా పెట్టేందుకు ముందుకు రావడం విశేషమని తెలిపారు. తన రాజకీయ అభివృద్ధి తో పాటు అనేక అంశాల్లో సహకరిస్తూ నియోజకవర్గ ప్రజలకు తమ వంతు సహకారం అందించే విధంగా అంబులెన్స్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేదవాడు ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆగిర్యల కృష్ణ రెడ్డి, చెంది తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చల్ల శ్రీకాంత్ రెడ్డి, జంగ నర్సింహులు, హరినాథ్ రెడ్డి, గూడ విరెష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి, కొత్తూరు కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నేతలు అగ్గనుర్ బస్వం, సురేష్ రెడ్డి, జాకరం చంద్ర శేఖర్, యెన్నం శ్రీధర్ రెడ్డి , గిరి యాదవ్, చంద్ర పాల్ రెడ్డి, కొప్పునుర్ ప్రవీణ్ త్రిప్పిశెట్టి కర్ణకర్, కొమ్ము కృష్ణ, బాధేపల్లి సిద్దార్థ, జాంగారి రవి, హైదర్ ఘోరీ, నెహ్రూ నాయక్, రాజు నాయక్, సుమన్ నాయక్, అన్వర్, అప్పరెడ్డిగూడ మల్లేష్,భాస్కర్ గౌడ్, లింగారెడ్డి గూడ అశోక్, ఖదీర్,సీతారాం, సుఖ్య నాయక్, రాందాస్ నాయక్, బసప్పా, నాగి సాయిలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >