Posted on 2025-11-04 12:43:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ఐదవ డివిజన్ బోర్గం ( పి) బిజెపి నాయకులు నరేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రత్యేక ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రతిభ హాస్పిటల్ లో ఉన్న ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ నీరూపు రెడ్డి, ఆర్థోపెడిక్ డాక్టర్ వంశీధర్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ కుమార్, లు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని, తాను అందించే సేవలు నిజమైన పేదవారికి దక్కినప్పుడే తనకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఇకపై కూడా తాను పదవుల్లో ఉన్న లేకున్నా సమాజ సేవలో ఓ బాధ్యతగల పౌరునిగా నిరంతరం పేదవారి సంక్షేమం వారికి ప్రభుత్వాలపరంగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా తెలియజెప్పడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తాను నివసిస్తున్న ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తున్నానని దాంట్లో భాగంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. అనంతరం మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఆరోగ్య శిబిరానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించిందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో హాస్పటల్ మేనేజ్మెంట్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రన్న, నాల్గవ డివిజన్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >