Posted on 2025-11-06 14:19:43
విద్యార్థులకు తృటి లో తప్పిన పెను ప్రమాదం
స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మక్లూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఆగి ఉన్న ఓ స్కూల్ బస్సును అదే దారి గుండా వెళ్తున్న లారీ ఢీకొండం ఘటన కలకలం రేపింది. ఇదే మండలానికి చెందిన చిక్లీ గ్రామ శివారులో ఉంది ఓ ప్రైవేట్ విద్యా సంస్థ బ్రిలియంట్ స్కూల్ కు సంబంధించిన విద్యార్థుల బస్సు విద్యార్థులను దించే క్రమంలో బస్సు ఎడమవైపు నిలిపి ఉంచారు ఆ బస్సు డ్రైవర్ వెంటనే ఆ వెనకాలనే వస్తున్న వడ్ల లారీ లోడుతో ఉన్న లారీ బస్సును ఢీకొనడంతో అందులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెనుక భాగం పూర్తిగా దెబ్బ తినడంతో అందులో ఉన్న విద్యార్థులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. తృటిలో జరిగిన ఈ ప్రమాదం లో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయి ఉంటే ఆస్పత్రుల పాలు కావాల్సి వచ్చేది. కాగా లారీ డ్రైవర్ మద్యం మత్తులో బస్సును ఢీ కొట్టారని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే లారీ డ్రైవర్ ను కిందకు దింపి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >