Posted on 2025-11-07 13:04:45
రైతులు అవస్థలు పడుతున్న పట్టించుకోని చేతకాని రాష్ట్ర ప్రభుత్వం
నిజామాబాద్ ఎంపీ అరవింద్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ధాన్యం సేకరణ లో అడుగడుగునా లోపాలున్నాయని, దీంతో రైతులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. విమర్శించారు. శుక్రవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. 2014 లో కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొనుగోలు చేసేదని కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని వివరించారు. పంటల మార్పిడి పై ప్రభుత్వం వ్యవసాయ అధికారుల చేత అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్ మెంట్ ఆపేసిన కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు బిసిల గురించి పార్టీమాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం రేవంత్ కేసీఆర్ కు గులాం గిరి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గరుస్తున్న అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఒక్కరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కుల చారి, మాజీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, పోతన్ కర్ లక్ష్మీనారాయణ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >