Posted on 2025-11-12 08:57:18
మంత్రి పదవి కోసం చివరిదాకా ప్రయత్నించి నిరాశలో ఉన్న ఆయనకు పార్టీ అధిష్టానం బుజ్జగించిందా..!
అందుకే సలహాదారుని పదవి తో సరిపెట్టుకున్నాడా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి కి ఇటీవల ఆ పార్టీ అధిష్టానం కేటాయించిన ప్రభుత్వ సలహాదారుడి పదవి ఆయనకు నిజంగా ఆయనకు సంప్రదించే పార్టీ అధిష్టానం ఆ పదవి కట్టబెట్టిందా లేదా బలవంతంగా ఆయనకు ఆ పదవి కేటాయించారా అనే విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సింది పోయి, తనకు నచ్చని విధంగా అధిష్టానం ప్రభుత్వ సలహాదారుడుగా బాధ్యతలు అప్పజెప్పడంతో ఆరోజు భోధన్ ఎంఎల్ఏ అధిష్టానం పై ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లు ఆయన వ్యక్తిగత సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఒక దశలో తనకు ఈ ప్రభుత్వ సలహాదారి పదవి అక్కర్లేదంటూ అక్కడి నుంచి కొద్దిసేపు బయటకు వెళ్లిపోయారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అధిష్టానం రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినా మీకే పదవి బాధ్యతలు అప్పగించాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఇవ్వలేకపోయామని, ఈసారి కి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని అధిష్టానం సుదర్శన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీలాంటి సీనియర్ నాయకులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిందని అందుకే ఆ పదవి అప్పజెప్పినట్లు ఆ ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత మంత్రి పదవిలో అత్యంత ప్రాధాన్యంతో కలిగిన పదవిని అందిస్తామని అధిష్టానం ఆయనకు భుజగించినట్లు సమాచారం అందుకే సీనియర్ నేత అయిన సుదర్శన్ రెడ్డి అధిష్టానం మాట విని ప్రభుత్వ సలహాదారుని పదవికి ఒప్పుకున్నట్లు తెలిసింది.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >