Posted on 2025-11-12 19:10:42
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయం 5వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ అలుక కిషన్ ఆధ్వర్యంలో, కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ, ఖజానాదారు సత్యనారాయణ, సభ్యులు ఉమా కిరణ్, సత్యం, గంధం వెంకటేశ్వర్లు, పెద్దోళ్ల నాగరాజు తదితర కమిటీ సభ్యుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, హాజరై, భక్తులకు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించిన వారు, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆలయంలో నిర్వహించిన మహా పూజలు, హోమాలు, అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున హాజరై దేవీదర్శనం చేసుకున్నారు. భక్తి నమ్మకాలు, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత ప్రతిఫలించిన ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది.
ఈ సందర్భంగా చైర్మన్ అలుక కిషన్ మాట్లాడుతూ “భక్తుల సహకారంతో ఆలయం ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని” తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని భక్తులు, అధికారులు, కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >