| Daily భారత్
Logo




డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

News

Posted on 2025-12-07 19:45:50

Share: Share


డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

ఇక సండే అయితే ఎవరు చెప్పినా ఎంత ఫైన్ వేసిన తగ్గేదేలే అంటున్న మద్యం ప్రియులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత కొన్ని రోజులుగా జిల్లాలో మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పోలీసులు మొదటిసారిగా పట్టుబడిన వారికి జరిమానా విధించి వదిలేస్తున్నారు. ఇక రెండవసారి అదే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కోర్టుకు అప్పజెప్పి 15వేల రూపాయల జరిమానా విడించడంతోపాటు కోర్టులో జడ్జి మద్యం ప్రియులకు కోర్టు శిక్ష ప్రకారం వారికి నాలుగు రోజులు జైలు శిక్ష విధిస్తున్నప్పటికీ మందుబాబుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు కనపడటం లేదు. ఓవైపు సిపి సాయి చైతన్య డ్రంక్ అండ్ డ్రైవ్ పై సీరియస్ గా వ్యవహరిస్తున్న మందు ప్రియులు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కేవలం పైనే కదా కట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నారో ఏంటో కానీ జరిమానాలకు, ఏ మాత్రం భయపడడం లేదు. ఇక వీకెండ్ ఆదివారం రోజు ఎలాగైనా మందు తాగాల్సిందే అనుకునే మద్యం ప్రియులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కొన్నిసార్లు పట్టుబడుతున్నారు. మరికొన్నిసార్లు పోలీసులకు కన్ను కప్పి ఇతర మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. అయితే నిబంధన ప్రకారం  మద్యం సేవించి వాహనం నడిపితే 10000 జరిమానా కట్టాల్సిందేనని పోలీసులు చెబుతున్నప్పటికీ, రెండవసారి దొరికితే 15000 రూపాయలు, మూడవసారి దొరికితే జరిమానా తో పాటు జైలు శిక్ష సైతం కోర్టులో వారిని హాజరు పరిచి న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం జైలుకు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివారం రైల్వే కమాన్ వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆదేశంసారం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 25 డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు ఎంత మొరపెట్టుకున్నా వాహనాదారులు ఏ మాత్రం లెక్క చేయకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు. మద్యం సేవించి పట్టుపడితే మొదటిసారి పదివేల రూపాయలు రెండవసారి 15వేల రూపాయలు మూడవసారి జైలు శిక్ష పరి అవకాశం ఉందని వారు అన్నారు. అయితే మందుబాబుల ఆగడాలు అరికట్టాలంటే మద్యం తాగి వాహనాలు సేవించి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికినప్పుడు వారి డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేస్తేనే వాహనదారులు ఒకింత భయం ఏర్పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >