Posted on 2025-12-19 18:08:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శబరిమలై అయ్యప్ప స్వామి పాదయాత్ర నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 44 రోజుల పాటు కొనసాగిన ఈ పవిత్ర పాదయాత్రలో అయ్యప్ప స్వామి దర్శనం సంపూర్ణంగా జరగడంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా నివాసంలో వారికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పాదయాత్రను నందకిషోర్ గురుస్వామి, జగదీష్ గురుస్వామి, రాజేందర్ గురుస్వామి, వసంత్ రాజ్ గురుస్వామి ల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు నియమనిష్ఠలు పాటిస్తూ పాదయాత్రలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప భక్తుల నియమ దీక్ష, భక్తి నిబద్ధతను అభినందిస్తూ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ శబరిమలై పాదయాత్ర భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించి, సమాజానికి సద్భావన సందేశాన్ని అందించిందని వారు పేర్కొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >