Posted on 2025-12-24 20:25:10
డైలీ భారత్ న్యూస్, తిరుపతి:ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బాహుబలి రాకెట్ బుధవారం ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది, బారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రస్థానం లో మరో మైలురాయి చేరింది. నేటి బుధవారం ఉదయం 8:54 గంటలకు ఎల్వీఎం-3 ఎం-6 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది
ఇస్రో(LVM-3 M-6). శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2 ను కక్ష్యలోకి పంపారు.
బ్లూ,బర్డ్,బ్లాక్ 2,6,400 కిలోల బరువుగల ఈ భారీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లే క్రమంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసింది LVM-3 M-6 రాకెట్.నిర్దేశిత కక్ష్యలో 15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తవగానే లో ఎర్త్ ఆర్బిట్(లియో)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది.
అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ వాణిజ్య ప్రయోగంతో తన బాహుబలి రాకెట్ ద్వారా ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >