Posted on 2025-12-25 19:03:30
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గ దళిత మోర్చా అధ్యక్షుడు మేళ్లచెరువు లక్ష్మణ ఆధ్వర్యంలో అటల్ బిహారి వాజ్పేయి 101 సంవత్సరాల జయంతి వేడుకలు మాజీ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఇంట్లో జరిగాయి. దళిత మోర్చాఅధ్యక్షుడు మాట్లాడుతూ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అటల్ బిహారి వాజ్పేయి డిసెంబర్ 25 1924 సంవత్సరంలో బటేశ్వరి గ్రామంలో ఆగ్రా జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినాడు. నేటికీ 101 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వాజ్పేయి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ కవి రచయిత రాజనీతి శాస్త్రజ్ఞుడు భారత దేశ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరై పార్లమెంటులో అత్యధిక కాలం ఎంపీగా పనిచేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయిదే అని కోనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కంటి నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి పట్టణ నాయకులు కొప్పెర సాయి, పిల్లి నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >