Posted on 2025-12-27 09:10:12
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ పాతబస్తీ మొఘల్పురా బీబీ బజార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ యాదవ్ పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు.విధుల నిర్వహణలో భాగంగా హోమ్ గార్డ్ హస్సాన్తో కలిసి ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్న సమయంలో ఒక మొబైల్ ఫోన్ లభ్యమైంది. దాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే సంబంధిత యజమానిని గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు.విచారణలో ఆ మొబైల్ ఫోన్ అదే ప్రాంతంలో జీవనాధారం కోసం ఆటో నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్దిగా నిర్ధారణ అయింది. అవసరమైన అన్ని ధృవీకరణలు పూర్తయ్యాక మొబైల్ ఫోన్ను నిజమైన యజమానికి సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనతో పోలీసుల నిజాయితీ, సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆస్తిని కాపాడడంలో ట్రాఫిక్ పోలీసులు చూపిన బాధ్యతాయుత వైఖరిని స్థానికులు ప్రశంసిస్తూ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ యాదవ్ను అభినందించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >