Posted on 2026-01-08 06:23:49
డైలీ భారత్, హుజూర్ నగర్: వేగంగా గమ్యం చేరాలని ఆరాటం కన్నా ప్రాణం విలువని తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల భవితవ్యాన్ని గుర్తు పెట్టు కోవాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా స్థానిక పాత బస్టాండ్ లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల అమలులోకి వచ్చిన నూతన చట్టాలలో రోడ్డు ప్రమాద కారకులకు కఠిన శిక్షలు నిర్దేశించబడ్డాయని రోడ్డు యాక్సిడెంట్ కేసులో ముద్దాయిగా ఉంటే ఆ కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుందని ఆమె తెలిపారు. వాహనాలు నడుపు తున్నప్పుడు మద్యం సేవించడం కానీ, హెల్మెట్ ధరించకపోవడం గానీ, సీటు బెల్టు పెట్టుకోకపోవడం గానీ, రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించకపోవడం గానీ శిక్షారమని అటువంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించబడతాయని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణికులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు తదితరుల చేత రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్ రాఘవరావు, నాగేష్ రాథోడ్, ఉదారి యాదగిరి,శంకర్ నాయక్, పెండెం సాయిరాం గౌడ్, నాగరాజు నాయక్, రామారావు, ఏఎస్ఐ బలరాం రెడ్డి, న్యాయశాఖ సిబ్బంది అనిత, సుశీల,పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >