Posted on 2026-01-11 15:50:39
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసం రవికుమారి. తెలియని వారు ఉండరేమో, తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్న ఆమె ఊరకనే ఉండకుండా విశిష్ట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తన గానంతో ప్రజల మెప్పును పొందుతున్నారు. తాజాగా సేవకు మారు పేరు అయిన ఆమె కిరీటంలో మరో కలిగితురాయి చేరింది. ఇప్పటికీ ఆమె చేసినవిశిష్ట సేవలకు గాను ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా కమ్మ వారి సేవా సత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు రత్నాలు అనే సాంస్కృతిక సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ అనే సంస్థ తెలుగు సాహిత్య గాన మంజరి పురస్కారం తో పాటు సమాజ సేవలో విశిష్ట సేవలు అందించిన రవి కుమారికి తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య తో "విశిష్ట సేవా రత్న "అవార్డు ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అవార్డును అందించిన డాక్టర్ యు వి వెంకటరత్నం, డాక్టర్ ధనాషి ఉషారాణి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని, మరిన్ని సేవలు చేసేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గాదే తులసీదాస్, గోళ్ళ భూపతి రావు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >