Posted on 2026-01-16 16:34:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చిన అల్లుడికి 150 రకాల వంటకాలతో విందు ఇచ్చారు. అయితే లక్ష్మి-రాంబాబు దంపతులు తమ కుమార్తెకు రెండు నెలల క్రితమే వివాహం జరిపించారు. సంక్రాంతి పండుగకు తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడి కోసం మంగాదేవితో కలిసి ఏకంగా 150 రకాల తీపి, పిండి వంటలను సిద్ధం చేశారు. పెద్ద అరటి ఆకులో ఈ వంటకాలన్నింటినీ వడ్డించి, కుటుంబ సమేతంగా విందు ఇచ్చారు. ఇది ఇలా ఉండగా నిజమైన సంక్రాంతి పండగ ఆ ఇంట్లో కనిపించింది అని స్థానికులు పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబల విలువలు, అల్లుళ్లకు, బంధువులకు ఇచ్చే గౌరవం ఏంటో వీరిని చూస్తే అర్థమవుతుందని ఆ ఊరి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >