Posted on 2026-01-16 11:17:18
డైలీ భారత్, స్పెషల్:
కవితా శీర్షిక కనుమ
ప్రకృతి నేస్తమైన బసవన్నలు ఎక్కడా
అని అడిగింది కనుమ
బోసిపోయిన పశులదొడ్డి
చూసి కన్నీరు కార్చింది కనుమ
అంబా అనే పిలుపు వినబడని
ఇంటి ముంగిటకి రాలేనంటుంది కనుమ
పాడిలేక పనిలేక జనాలు వలసబాట పట్టిన
పల్లెల్లోకి రాలేనంటుంది కనుమ
రంగురంగుల రంగవల్లిలో గొబ్బెమ్మలు
లేవని, సంప్రదాయాలను వదిలేసిన
మనకు రథసారధి కాలేనంటుంది కనుమ
పాడిపశువుల ప్రేమాపాశము పంచుకుంటేనే
కనుమ
పాడిపశువులను పకృతిని పదికాలాలు
కాపాడుకోవాలని కోరుకుంటూ
కనుమ పండుగ శుభాకాంక్షలతో
రచన:
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >