| Daily భారత్
Logo




ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బిజెపి

News

Posted on 2026-01-29 17:55:51

Share: Share


ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బిజెపి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన ఇందూరు మన మేయర్ నినాదంతో ముందుకెళ్దాం

బిజెపి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా గత మూడు ధపాలుగా ప్రధానిగా దేశాన్ని పరిపాలిస్తూ ఏమాత్రం అవినీతి లేని దేశంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని నిజామాబాద్ అర్బన్  ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  పేర్కొన్నారు. గురువారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సమక్షంలో నగరంలోని 22వ డివిజన్ నుండి మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తo, అదే డివిజన్ నుండి తాటికొండ రాము, ఆకుల శ్రీనివాస్, రాజ్ కుమార్, గౌత ఆనంద్, కుందన్ శ్రీనివాస్ లతో పాటు సుమారు 200 మంది డివిజన్ వాసులు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన ఇందూర్ మన మేయర్ అనే నినాదంతో బిజెపి శ్రేణులు ప్రతి డివిజన్ లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బిజెపి పార్టీ అంటేనే అభివృద్ధి అని అభివృద్ధి అంటేనే బిజెపి పార్టీ అని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఎంపీ అరవింద్ జిల్లాలో చేస్తున్న విస్తృత అభివృద్ధి పనులకు ఆకర్షితులై, మున్సిపల్ ఎన్నికలకు ముందు బిజెపి పార్టీలో చేరడం శుభపరిణామం అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరకే అందివ్వడం, అలాగే చిరు వ్యాపారులకు ముద్ర లోన్ పథకం కింద లక్ష రూపాయల వరకు రుణ సదుపాయాలు అందివ్వడం, వాటి ద్వారా చిన్న, మధ్య తరగతి ప్రజలు స్వతహాగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఈ రుణాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా కేవలం 14 రూపాయలతో దేశ ప్రజలకు ప్రధాని మోడీ  రెండు లక్షల జీవిత బీమా కల్పించడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో కచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ఈ చేరికల ద్వారా తనకు పూర్తి నమ్మకం కలుగుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ నుండి సుమారు 200 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిజెపి పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా 22వ డివిజన్ మహిళా మణులు రాబోయే రోజుల్లో బిజెపి వైపే తాముంటామని ఎమ్మెల్యే కి భరోసా కల్పించారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >