| Daily భారత్
Logo




రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ భవిష్యతైన యువతను కోల్పోతున్నాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

News

Posted on 2026-02-24 17:01:08

Share: Share


రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ భవిష్యతైన యువతను కోల్పోతున్నాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

డైలీ భారత్, వరంగల్: రోడ్డు నిబంధనలు పాటించకుండపోవడంతో ఎంతో మంది దేశ భవిష్యతైన యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వల మేరకు ప్రతి నెల చివరి వారం నిర్వహించే “ అరైవ్ అలైవ్ ” రెండవ విడత కార్యక్రమములో భాగంగా వరంగల్ ట్రాఫిక్ ఆధ్వర్యంలో హన్మకొండలోని వాగ్డేవి కళాశాల విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్ అలైవ్” ఏర్పాటు చేశారు. ముందుగా ఈ కార్యక్రమములో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విధ్యార్థులకు ప్రతి వాహనదారుడు పాటించాల్సిన ట్రాఫిక్ నిబందనలు, వాటిని అతి క్రమిస్తే జరిగే పరిణాలపై ట్రాఫిక్ అధికారులు విద్యార్థులకు వివరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న  వరంగల్ పోలీస్ కమిషనర్ విధ్యార్థులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకుంటూ వాహనం నడపాలని, ఇదే వాహనదారుడు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వాహనదారుడిపై వుందని వాహనదారుడు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపటం ద్వారా ప్రమాదాలకు గురైయ్యే అవకాశాలు ఎక్కువని, తన థ్రిల్ కోసం వాహనదారుడు వాహనం నడపటం చాలా ప్రమాదకమని, కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఇలాంటి చర్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎంతో నష్టాపోతారని, కావున ప్రతి వాహనదారుడు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ డిఫెన్సీ డ్రైవింగ్ చేయాలని సిపి విద్యార్థులకు సూచించారు. గత సంవత్సరంలో హత్యలు లేదా ఇతర కారణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏనిమిది వందల మంది మరణించారు. కాని రోడ్డు ప్రమాదాల కారణంగా గతే ఏడాది 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడటం చాలా బాధకరమని, ప్రతి  వాహనదారుడు  ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనం నడపాల్సిందిగా తెలియజేయాలని పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు.

అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డిసిపి  ప్రభాకర్ రావు, ఏసిపి సత్యనారయణ, ఇన్స్‌స్పెక్టర్లు వెంకన్న,సీతరెడ్డి,సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్స్‌పాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి హరిచంద్ర రెడ్డి పాల్గొన్నారు.



Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >