| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ ఆఫీసర్‌

News

Posted on 2026-02-24 19:49:39

Share: Share


ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ ఆఫీసర్‌

డైలీ భారత్, భీమవరం: అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటుండగా ఓ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీగా లంచం తీసుకుంటూ అటవీశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సురేష్, ఒక పని నిమిత్తం బాధితుడి నుంచి 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించింది. సురేష్ తన కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి రూ. 4 లక్షల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సురేష్ కార్యాలయం, నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.


#acb

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >