Posted on 2026-02-24 20:55:29
డైలీ భారత్, వైరా: ఖమ్మం జిల్లా వైరాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా రవాణా అవుతున్న 101.2 కిలోల ఎండు గంజాయితో పాటు 2.7 కిలోల హాషీష్ ఆయిల్ను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అనుమాస్పదంగా ఉన్న హర్యానా నెంబర్ ప్లేట్ కలిగిన కారును ఆపి చెక్ చేసింది. తనిఖీల్లో గంజాయి, హ్యాషిష్ ఆయిల్ బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మహమ్మద్ అస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వైరా ఎక్సైజ్ స్టేషన్కు నిందితుడిని అప్పగించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ సుమారు 67.20 లక్షల రూపాయలుగా తెలుస్తోంది.
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >