| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : పొక్సో కేసులో ఇద్దరికి జైలు మరియు జరిమాన

News

Posted on 2026-02-26 14:23:54

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : పొక్సో కేసులో ఇద్దరికి జైలు మరియు జరిమాన

జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు , శిక్షలతోనే సమాజంలో మార్పు

నిందుతులకు శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను , పిపిలను,కోర్ట్ కానిస్టేబుల్లను అభినందించిన జిల్లా ఎస్పీ.

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: మైనర్ బాలిక పై బలవంతపు వేధింపుల (పొక్సో) కేసులో ఇద్దరు నిందితులకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2000/-రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను 2021 సంవత్సరంలో వరుసకి అన్న అయిన తూర్పటి ప్రవీణ్  S/o జానీ అను అతను బలవంతపు వేధింపులకు గురి చేయగా అట్టి విషయంలో ప్రవీణ్ తండ్రి అయిన జానీ మరియు నానమ్మ అయిన పొచవ్వ లు ఎవరికైనా చెప్తే చంపేస్తాం అని బాధితులని బెదిరించారు. ఇట్టి విషయం పై  బాధితురాలి యెక్క తల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేయగా దర్యాప్తు అనంతరం అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినాడు

ప్రాసిక్యూషన్ తరపున పి.పి.లు వేముల లక్ష్మీ ప్రసాద్, పెంట శ్రీనివాస్ వాదించగా,CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్  కానిస్టేబుల్లు శ్రీనివాస్,నవీన్ లు కోర్టులో 10 మంది సాక్షులను ప్రవేశపెట్టాగా,కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల  పొక్సో కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ గారు ఇద్దరు నిందుతులు అయినటువంటి తూర్పటి జానీ,తూర్పటి పొచవ్వకి నాలుగు సంవత్సరల జైలు శిక్ష తో పాటు ఒక్కక్కరికి 2000/- రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు.తూర్పటి ప్రవీణ్ మైనర్ కావడం వలన అతని మీద కేసు ప్రస్తుతం జువెనైల్ కోర్టులో నడుస్తుందని తెలిపారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.

పైకేసులలో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీలు వేముల లక్ష్మీ ప్రసాద్,పెంట శ్రీనివాస్,CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు,కోర్ట్ కానిస్టేబుల్ లు నవీన్, శ్రీనివాస్, అప్పటి పోలీస్ అధికారులు ఎస్.ఐ వెంకటకృష్ణ,డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >