Posted on 2026-02-26 21:43:31
ఒకరికి 7 రోజుల జైలు శిక్ష, 12 మందికి జరిమానా
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల ప్రాణ భద్రతను పరిరక్షించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మందిని గుర్తించి, వారి పై కేసులు నమోదు చేసి గౌరవ కోర్టులో హాజరుపరచడం జరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, గౌరవ కోర్టు 12 మందికి జరిమానా విధించడంతో పాటు, ఒక నిందితుడికి 7 రోజుల సాదారణ జైలు శిక్ష విధించింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం మాత్రమే కాకుండా, అత్యంత ప్రమాదకరమైన చర్య. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాల్లో వాహనం నడిపే వ్యక్తి ప్రాణంతో పాటు, ఇతర నిరపరాధుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి తన కుటుంబం, పిల్లలు మరియు తనపై ఆధారపడిన వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ప్రజలు కేసులు, కోర్టు చర్యలు మరియు జరిమానాల గురించి మాత్రమే ఆలోచించకుండా, స్వచ్ఛందంగా తమ ప్రాణ భద్రత, కుటుంబ భద్రత మరియు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్పై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >