Posted on 2026-02-27 12:44:33
2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం?
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. 6వ తరగతి విద్యార్థులు మూడు భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు కచ్చితంగా భారతీయ భాషలై ఉండాలి. అయితే ఈ కొత్త విధానంలో ఇంగ్లిష్ను విదేశీ భాషగా పరిగణిస్తారు.
ఇప్పటికే 6వ తరగతిలో ఆంగ్ల భాషను బోధిస్తున్నందున దీనిని విదేశీ భాషగా లెక్కకడతారు. వీటితో పాటు రెండు భారతీయ భాషలను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం 8వ తరగతి వరకే అమలవుతుందని పేర్కొంటున్నా, 9, 10 తరగతులకు కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. అంటే 2031 నాటికి 10వ తరగతి బోర్డ్ పరీక్ష రాసే విద్యార్థులు మూడో భాషా పరీక్షను కూడా రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విద్యార్థులు రెండు భాషా పేపర్లకు మాత్రమే హాజరవుతున్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >