| Daily భారత్
Logo




ఉపాధ్యాయుల మనోస్థైర్యం దెబ్బతినేలా ఆకునూరి మురళి నివేదిక

News

Posted on 2026-02-28 03:34:58

Share: Share


ఉపాధ్యాయుల మనోస్థైర్యం దెబ్బతినేలా ఆకునూరి మురళి నివేదిక

ఖండించిన టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నిన్న సమర్పించిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ నివేదికలో కొన్ని సానుకూల అంశాలున్నప్పటికీ, స్థూలంగా చూసినట్లయితే విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించే విధంగా ఉన్నదని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిర్వహింపబడుతున్నటువంటి విద్యాసంస్థలను బలోపేతం చేసి మౌలిక సౌకర్యాలు కల్పించి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా, మరొక కొత్త విధానాన్ని తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో మండలానికి రెండు మూడు పాఠశాలను 1500 మంది విద్యార్థులతో నెలకొల్పాలని ఆ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించాలని, అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని సంవత్సరానికి 100 పాఠశాలలు నిర్మించుకుంటూ పోతే ప్రస్తుతం ఉన్న సాధారణ పాఠశాలలు ఏమి కావాలి  అదే సమయంలో ఆ పాఠశాలకు ఉపాధ్యాయులను ఎలా రిక్రూట్ చేస్తారో చెప్పలేదు.

తండాలు మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలను మూసివేసే దిశగా ఆయన సిఫార్సులు ఉన్నాయి. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఉపాధ్యాయులపై తనకున్న అక్కస్ను రిపోర్టులో వెళ్ళగక్కారు ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయని వీటిని హేతుబద్దీకరించాలని ఆయన అనడం పూర్తిగా హాస్యాస్పదం వేతనాలు ఏ విధంగా నిర్ణయిస్తారు వేతన సంవత్సర ద్వారా శాస్త్రీయంగా అనేక కొలమానాలను పరిశీలించి, ద్రవ్యోల్బణం, వినియోగదారుల సూచి, మొదలగు అంశాల ద్వారా  హేతుబద్ధంగా సిఫార్సు చేస్తారు.

ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు నాలుగు పిఆర్సీలు ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోయారు ఇదంతా పక్కకు పెట్టి కేవలం ఉపాధ్యాయులనే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని చూపించి సమాజం దృష్టిలో ఉపాధ్యాయులను పలుచన చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పి భావిస్తున్నాం.

ఇక ఉపాధ్యాయుల పదోన్నతుల విషయమై ఇప్పటికే ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందడానికి 20 30 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి అయినప్పటికీ తన మొత్తం సర్వీసులో ఒక ప్రమోషన్ కూడా పొందకుండా పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు ఎందరో ఉమ్మడి సర్వీస్ రూల్స్ పరిష్కారం కాకపోవడం మూలాన పర్యవేక్షక పోస్టులన్నీ ఇన్చార్జిలమయం అయిపోయి పదోన్నతులు పొందలేని పరిస్థితి నెలకొని ఉన్నది. ఇవన్నీ పట్టించుకోకుండా ఏకపక్షంగా సిఫార్సులు చేయడం ఆకునూరి మురళి సంకుచిత స్వభావానికి నిదర్శనం కనిపిస్తున్నది.

ఆకునూరి మురళి సిఫార్సులను వ్యతిరేకిస్తూ కలిసిచ్చే సంఘాలను కలుపుకొని ఈ సిఫార్సులకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉన్నదని టి పి టి ఎఫ్ కామారెడ్డి  జిల్లా శాఖ భావిస్తుంది..

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >