| Daily భారత్
Logo




బాధితుడి వద్దకే చేరి FIR నమోదు

News

Posted on 2026-03-01 15:13:23

Share: Share


బాధితుడి వద్దకే చేరి FIR నమోదు

ప్రజల భరోసాను బలోపేతం చేస్తున్న కామారెడ్డి జిల్లా పోలీసులు

సంఘటన స్థలంలోనే, ఆస్పత్రిలోనే ఫిర్యాదు స్వీకరణ వేగవంతమైన పోలీస్ సేవలు

బాధితుల ఇబ్బందులను అర్థం చేసుకుని స్పందించడం సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ లక్ష్యం

“పోలీసులు ప్రజల కోసం… బాధితుడికి అండగా నిలవడం మా బాధ్యత” – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS

డైలీ భారత్, కామారెడ్డి: ప్రజలకు మరింత చేరువగా ఉండి, బాధితులకు తక్షణ న్యాయం అందించాలనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా పోలీసులు ‘సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, పోలీసులు స్వయంగా సంఘటన స్థలానికి లేదా ఆస్పత్రికి చేరుకుని ఫిర్యాదులు స్వీకరించి, అక్కడికక్కడే FIR నమోదు చేసి, FIR కాపీని బాధితులకు అందజేస్తున్నారు.

తాజా ఘటనల వివరాలు

1. గాంధీనగర్ కాలనీలో దొంగతనం – సంఘటన స్థలంలోనే FIR నమోదు

పిర్యాది బుజ్జి స్వామి (తండ్రి: దేవయ్య) గారు, తేది 28.02.2026 సాయంత్రం సుమారు 7:00 గంటలకు తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మాచారెడ్డికి ఫంక్షన్ నిమిత్తం వెళ్లి, ఈరోజు ఉదయం సుమారు 8:00 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండగా, బీరువాలో దాచిన సుమారు రెండు తులాల బంగారం మరియు కొంత నగదు గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేసినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని, బాధితుడి ఫిర్యాదును అక్కడికక్కడే స్వీకరించి, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్‌లో భాగంగా సంఘటన స్థలంలోనే FIR నమోదు చేసి, FIR కాపీని బాధితుడికి అందజేశారు.

2. వేల్పుగొండ గ్రామంలో ప్రమాదం – ఆస్పత్రిలోనే FIR నమోదు

తేది 28.02.2026 నాడు వేల్పుగొండ గ్రామానికి చెందిన మొగుళ్ళ చిన్న బాలరాజు (58) గారు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై బయలుదేరిన సమయంలో, సమీపంలో నిర్లక్ష్యంగా తాళం చెవి ఉంచి నిలిపిన ట్రాక్టర్‌ను ఒక చిన్న బాలుడు స్టార్ట్ చేయడంతో ట్రాక్టర్ వెనుకకు కదిలి ఆయనపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్న బాలరాజు కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2:30 గంటలకు మృతి చెందారు.

సమాచారం అందుకున్న మాచారెడ్డి ఎస్సై ఆస్పత్రికి చేరుకుని, మృతుని భార్య నుండి ఫిర్యాదు స్వీకరించి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి, FIR కాపీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ప్రజలకు అండగా నిలుస్తున్న పోలీస్ శాఖ

బాధలో ఉన్న సమయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం చాలా మందికి కష్టసాధ్యం అవుతుంది. అలాంటి సందర్భాల్లో పోలీసులు స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించడం, అక్కడికక్కడే కేసు నమోదు చేయడం వల్ల బాధితులకు తక్షణ న్యాయం ప్రారంభమైన భావన కలుగుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు అసహాయ స్థితిలో ఉన్నవారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా మారింది.

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో అమలవుతున్న ఈ విధానం ప్రజలలో పోలీసులపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

“బాధితుడు ఎక్కడ ఉన్నా… పోలీస్ సహాయం అక్కడికే చేరాలి” అనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజల సేవలో నిబద్ధతతో పనిచేస్తున్నారు.

Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >