Posted on 2026-03-01 18:26:22
డైలీ భారత్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసి అభివృద్ధి చేసిన పోలీస్ అతిథి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, IPS ఆదివారం ప్రారంభించారు. ఈ సాయంత్రం హన్మకొండ పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న డిజిపి గారు వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిజిపి అనంతరం పునరుద్ధరించిన ఆధునిక సదుపాయాలతో రూపొందించిన పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించారు.
పోలీస్ శాఖ అధికారుల, అతిథుల వసతి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ఈ అతిథి గృహం పునర్నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో, సౌకర్యవంతమైన వాతావరణంలో రూపొందించిన ఈ అతిథి గృహం భవిష్యత్లో శాఖకు మరింత ఉపయోగకరంగా ఉండనుందని డిజిపి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనరేట్కు చెందిన డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, శుభం నాగ్, అదనపు డీసీపీ లు రవి, శ్రీనివాస్, సురేష్ కుమార్, తో పాటు ఏసీపీలు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >