Posted on 2026-03-20 18:32:18
నిందుతుల వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం.
డైలీ భారత్, సిరిసిల్ల: తేదీ 17-03-2026 రోజు రాత్రి సమయంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయినగర్ లో మేర్గు లత తన ఇంటి వద్ద గేటు బయటకు రాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ మెడలోగల బంగారు పుస్తెలు బలవంతంగా తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోగా,మేర్గు లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందుతులను సయ్యద్ మౌలాన,మంగురు ప్రకాష్ యాదవ్ లుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందితులు సిరిసిల్ల కు వస్తున్నరన్న సమాచారం మేరకు రడుగు చౌరస్తా వద్ద నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను రిమాండుకి ఈరోజు పంపించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామాలలో, పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరినారు.
నిందితుల వివరాలు:
A1. సయ్యద్ మౌలాన తండ్రి: బడే సాబ్, వయస్సు: 22 సం లు. r/o తుర్కశినగర్ కొడిమ్యాల, మండల జగిత్యాల జిల్లా.
A2. మంగురు ప్రకాష్ యాదవ్, తండ్రి: ధర్మేందర్, వయస్సు: 19 సం లు. r/o వేదిరే గ్రామం, రామడుగు మండల, కరీంనగర్ జిల్లా.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >