Posted on 2026-03-23 19:47:05
డైలీ భారత్, సిరిసిల్ల: తేది 23-03-2026 రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచిఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చిందని. కోర్టు అధికారిక ఈ-మెయిల్కు పంపిన సందేశంలో దుండగులు కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు, అది పేల్చివేస్తామని హెచ్చరించినట్లు ఉండగా సంఘటనా స్థలానికి చేరుకుని కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని తదుపరి చర్యగా డాగ్ స్క్వాడ్ మరియు బాంబు డిస్పోజల్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు గదులు, పరిసర ప్రాంతాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో గంటల తరబడి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని తెలిపారు. తనిఖీలలో బాంబు కి సంబందించిన ఎలాంటి ఆనవాళ్ళు కానీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ కన్పించలేదు. తదుపరి ఇదే విషయంలో కోర్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ N.సత్యనారాయణ మూర్తి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంబించినట్లుగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ N. శ్రీనివాస్ తెలిపారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >