Posted on 2026-03-27 18:45:58
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వప్నలోక్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని స్వప్నలోక్ కార్యవర్గం, కాలనీవాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని ఆలయ అర్చకులు శ్రీహర్ష తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ రామనవమి సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయంలో అఖండ నామము, సుప్రభాతసేవ, మూల విరాట్లకు, ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, మంగళస్నానం, సహస్రనామార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, 11వ వార్డ్ కౌన్సిలర్ రాణి శ్రీనివాస్, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >