Posted on 2026-03-27 22:22:33
జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మరియు బాన్సువాడ పట్టణాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ తెలిపారు. భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా పండుగను జరుపుకునేలా అన్ని కీలక ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని మోహరించడం జరిగింది.
పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా సర్వే లెన్స్ 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ వ్యాన్ పై , డ్రోన్ల సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని ఎస్పీ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా ఎస్పీ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మతసామరస్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని మరొక్కసారి గుర్తు చేశారు
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >